తమిళనాడులో చంద్రబాబు ప్రచారం.. ఎన్డీయే కోసం రంగంలోకి టీడీపీ అధినేత

  • తమిళనాడులో ఎన్డీయే తరఫున ప్రచారానికి చంద్రబాబు
  • రేప‌టి నుంచి రెండు రోజుల పాటు పర్యటన
  • కోయంబత్తూరు, చెన్నై, మధురైలలో సభలు, రోడ్‌షోలు
  • ఎన్డీయే అభివృద్ధి అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహం
  • ఈ నెల‌ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తమిళనాడు వెళ్లనున్నారు. తమిళనాడులో ఈ నెల 23న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సీఎం చంద్రబాబు ఈ నెల 20, 21 తేదీల్లో తమిళనాడులోని కోయంబత్తూరు, హోసూరు, తళ్లి, ఆవడి, మధురైలలో ఎన్డీఏ పక్షాల అభ్యర్ధుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు. 

రేపు ఉదయం అమరావతి నుంచి కోయంబత్తూరు బయల్దేరి వెళ్లనున్న ముఖ్యమంత్రి... మధ్యాహ్నం ఒంటిగంటకు కోయంబత్తూరులో నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం హోసూరు నుంచి తళ్లి చేరుకుని సాయంత్రం 4.45 గంటలకు ప్రచార ర్యాలీకి హాజరవుతారు. రాత్రికి చెన్నై చేరుకుని ఆవడిలో జరుగనున్న రోడ్ షోలో  పాల్గొని ఎన్డీఏ అభ్యర్ధుల తరపున ప్రచారం చేయనున్నారు. 

రేపు రాత్రికి అక్కడే బస చేయనున్న సీఎం చంద్రబాబు... 21వ తేదీ ఉదయం చెన్నై నుంచి బయల్దేరి మధురై చేరుకోనున్నారు. మధురై సమీపంలోని సాత్తూర్ లో మధ్యాహ్నం ఒంటిగంటకు వివిధ సామాజిక వర్గాల నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం 3 గంటలకు సాత్తూర్ లోనే ఎన్డీఏ అభ్యర్ధి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. సాయంత్రం 5.15 గంటలకు మధురై నుంచి హైదరాబాద్ కు వెళతారు.

Chandrababu
Tamil Nadu Elections
TDP
NDA Alliance
Coimbatore
Chennai
Election Campaign
Tamil Nadu Politics
Andhra Pradesh CM
Narendra Modi

More Telugu News